Tuesday, December 5, 2023
Google search engine
Homeగిరిజనంవైసీపా ప్ర‌జాప్ర‌తినిధులు గిరిజ‌నులో కాదో తేల్చుకోండి

వైసీపా ప్ర‌జాప్ర‌తినిధులు గిరిజ‌నులో కాదో తేల్చుకోండి


జ‌న‌సేన అర‌కు పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ వంపూరు గంగుల‌య్య‌



బోయ‌వాల్మీకి, బెంతు ఒరియాల‌ను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయ‌డంపై గిరిజ‌న జాతి తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో తీర్మానాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తూ గిరిజ‌న జేఏసీ ఉద్య‌మాన్ని ఉధృతం చేసింది. ఈ నేప‌థ్యంలో ఈనెల 31న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం జేఏసీ నాయ‌కులు విలేక‌రుల‌తో మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో ఇది…. ఇందులో ప్ర‌ధానంగా ఏడుగురు ఎమ్మెల్యేల‌ను, ఎంపీని ఏక మొత్తంగా గిరిజ‌న ప్ర‌జ‌లంతా వైసీపీకే మ‌ద్ద‌తు తెలిపి గెలిపిస్తే ఆదివాసీ జాతికిచ్చిన గొప్ప బ‌హుమ‌తి ఇదా అని ఈ స‌మావేశంలో జ‌న‌సేన అర‌కు పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ వంపూరు గంగుల‌య్య ప్ర‌శ్నించారు. వైసీపీ ప్ర‌తిప్ర‌తినిధులంతా నిజ‌మైన గిరిజ‌నులైతే వెంట‌నే అసెంబ్లీలో ప్ర‌వేశ తీర్మానాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరారు. ప్ర‌భుత్వం స్పందించ‌కుంటే ఉద్య‌మం తీవ్రం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Janasena Leader Dr. Vampuru Gangulaiah spoke at Pressmeet at Paderu
Janasena Leader Dr. Vampuru Gangulaiah and Girijan JAC shouting againest YRCP Govt Pressmeet at Paderu
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular